సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన కాబోయే సీఎస్ రామకృష్ణారావు

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-28 09:22:52  IST  )

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదివారం సాయంత్రం అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన కాబోయే సీఎస్ రామకృష్ణారావు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary Telangana Government)గా సీనియర్ ఐఏఎస్ రామకృష్ణా రావు (Rama Krishna Rao) నియమితులయ్యారు. ఈ మేరకు ఇవాళ ఆయన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, 1991 ఐఏఎస్‌కు బ్యాచ్​చెందిన రామకృష్ణా రావు తెలంగాణ రాష్ట్రం (Telangana State) ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక శాఖ (Department of Finance)లో బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. వచ్చే ఆగస్టులో ఆయన పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన సుదీర్ఘ కాలం ఆర్థిక శాఖలో చేసిన సేవలను గుర్తించిన సర్కార్ అనుభవం దృష్ట్యా రామకృష్ణా రావును సీఎస్‌గా నియమించింది. ఆయన గతంలో నల్లగొండ (Nalgonda) జాయింట్​కలెక్టర్‌గా, గుంటూరు (Guntur) జిల్లా కలెక్టర్‌గా కూడా విధులు నిర్వర్తించారు.

Next Story