- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్కు శంకుస్థాపన
ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ ఫ్యూచర్ సిటీని ప్రభుత్వం అభివృద్ధి చేయాలని అనుకుంటుందన్నారు. అభివృద్ధిలో భాగంగానే అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ ఫ్యూచర్ సిటీని ప్రభుత్వం అభివృద్ధి చేయాలని అనుకుంటుందన్నారు. అభివృద్ధిలో భాగంగానే అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఫ్యూచర్ సిటీకి వచ్చే పెట్టుబడులకు, పరిశ్రమలకు ఇది మంచి ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచంలోనే అత్యంత అధునాతన నగరంగా నిర్మించాలని అనుకున్నట్టు చెప్పారు. ఫ్యూచర్ సిటీలో ఫార్చూన్ 500లోని కంపెనీలను ఆహ్వానిస్తున్నామని అన్నారు. గతేడాది గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసి 108 దేశాల నుండి పరిశ్రమలను ఆహ్వానించినట్టు చెప్పారు. తన టీంలోని మంత్రులు ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. 2034 వరకు 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధించడమే తన లక్ష్యం అని తెలిపారు. 2047 వరకు 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. 2047 వరకు భారత ప్రభుత్వం 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని లక్ష్యంగా పెట్టుకుందని అందులో 10శాతం జీడిపీ తెలంగాణ నుండి ఉండాలన్నారు. అది సాధించాలంటే పెట్టుబడులు కావాలని, వసతులు కావాలని నిరుద్యోగం పోవాలన్నారు. అందుకోసమే తమ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ పాలసీని తీసుకువచ్చిందన్నారు.
తెలంగాణ రైజింగ్ పాలసీలో ప్రముఖ విద్యావేత్తలను, వ్యాపారవేత్తలను చేర్చామని చెప్పారు. పరిశ్రమలకు సింగిల్ విండోలోనే అన్ని అనుమతులు ఇస్తామన్నారు. రాబోయే 14ఏళ్లలో 7మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని అమెజాన్ భావిస్తోందని కానీ తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు అది సరిపోదన్నారు. 2034 వరకు ఫ్యూచర్ సిటీలో లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టాలని కోరారు. అందుకోసం మీకు ఎలాంటి సహాకారం కావాలన్నా అందిస్తామని అన్నారు. మంత్రులు, అధికారులను సంప్రదించి మీకు ఏం కావాలన్నా అడగొచ్చని చెప్పారు. తాను దీనిపై తరచూ రివ్యూ నిర్వహిస్తానని అన్నారు. ఒక పాలసీ లేకపోతే రాష్ట్రం అభివృద్ధి జరగదని అన్నారు. అందుకే తెలంగాణను అభివృద్ధి చేసేందుకే పాలసీలను రూపొందించామన్నారు. రాష్ట్రానికి అన్వెస్ట్ మెంట్ పాలసీ, మెడికల్ పాలసీ, స్పోర్ట్స్ పాలసీ, ఎనర్జీ పాలసీ, టూరిజం పాలసీలు ఉన్నాయని చెప్పారు. నిరుద్యోగాన్ని పోగొట్టేందుకు స్కిల్ యూనివర్సిటీని తీసుకువచ్చామన్నారు. 2047 నాటికి భారత్ వంద సంవత్సరాల స్వతంత్ర ఉత్సవాలను జరుపుకోబోతుందని ఆ నాటికి దేశ జీడీపీలో తెలంగాణ జీడీపీ 10 శాతం ఉండేలా పనిచేస్తున్నామని అన్నారు.
ఇందులో భాగంగానే అధికారులు, మంత్రులు నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు. అమెజాన్ డేటా సెంటర్ ఫ్యూచర్ సిటీ అభివృద్దికి మైలురాయిగా మారుతుందని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వచ్చినప్పుడు ఇది సాధ్యం కాదని చాలా మంది అన్నారని కానీ ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఫార్మా కంపెనీలు, ఐటీ కంపెనీలు వచ్చాయన్నారు. కానీ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చాలంటే ప్రజలకు సౌకర్యాలు కల్పించాలంటే నగరంలోని పరిశ్రమలను తరలించాల్సిన అవసరం ఉందన్నారు. నగరంలో మెట్రో విస్తరణ జరగాలని, ఇంధనంతో నడిచే ఆర్టీసీ బస్సులను నగరం వెలుపలకు తరలించి ఈవీ బస్సులను ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. నగరంలో ఎవరు ఈవీ వాహనాలు కొన్నా జీరో ట్యాక్స్ విధించేలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
అదే విధంగా మూసీని ప్రక్షాళన చేసి కాలుష్యం లేకుండా చేస్తామని తెలిపారు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, పరిశ్రమల తరలింపును కోర్ అర్బన్ రీజియన్గా పేరు పెట్టుకున్నామని అన్నారు. కోర్ అంటే క్యూర్ అని.. 2073 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని కాలుష్యం నుండి క్యూర్ చేయడమే తమ లక్ష్యం అని చెప్పారు. క్యూర్ ప్రాంతాన్ని సర్వీస్ సెక్టార్ గా రీడిజైన్ చేస్తామని అన్నారు. అవుటర్ రింగ్ రోడ్డు బయటవైపు, రీజినల్ రింగ్ రోడ్డకు ఇవతల వైపు 10కిమీలు మ్యాన్యుఫ్యాక్చరింగ్ జోన్ గా నిర్ణయించామన్నారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన రైతులను ప్రభుత్వం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుందని తెలిపారు. రైతులకు నష్టం జరగకుండా నష్ట పరిహారం అందిచాలని అధికారులకు సూచిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఇతర నాయకులు పాల్గొన్నారు.






