బీజేపీ కీలక నిర్ణయం.. మాజీ ఎంపీకి మునుగోడు బాధ్యతలు

by Disha Web Desk 2 |
బీజేపీ కీలక నిర్ణయం.. మాజీ ఎంపీకి మునుగోడు బాధ్యతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు ఉప ఎన్నికల బాధ్యతలను మాజీ ఎంపీ వివేక్ కు అప్పగించారు. స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా వివేక్ ను నియమిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారు. 16 మందితో స్టీరింగ్ కమిటీని ప్రకటించారు. స్థానికుడైన గంగిడి మనోహర్ రెడ్డికి కోఆర్డినేటర్ గా బాధ్యతలు అప్పగించారు. సభ్యులుగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాజీ ఎంపీలు ఏపీ జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, విజయశాంతి, రవీంద్ర నాయక్, రాపోలు ఆనంద్ భాస్కర్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ స్వామి గౌడ్, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీ నారాయణ, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, మాజీ నేషనల్ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి, దాసోజు శ్రవణ్ ను నియమించారు. ఇదిలావుండగా దుబ్బాక, హుజురాబాద్ తరహాలో ఉప ఎన్నిక ఇంచార్జీ అని కాకుండా స్టీరింగ్ కమిటీ అని ప్రకటించడం బీజేపీ లో చర్చనీయాంశంగా మారింది.


Next Story

Most Viewed