ఎన్నికల వేళ ఉద్యమకారులకు మాజీ MP పొన్నం కీలక పిలుపు

by Disha Web Desk 19 |
ఎన్నికల వేళ ఉద్యమకారులకు మాజీ MP పొన్నం కీలక పిలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపు అనివార్యంగా మారిందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రజలంతా కాంగ్రెస్‌ను గెలిపించాలని ఫిక్స్ అయ్యారని, ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీకి అందరూ అండగా నిలవాలని ఆయన సోషల్ మీడియా వేదికగా కోరారు. ఉద్యమకారులంతా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలని, పవర్‌లోకి రాగానే అందరికీ సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో అనే నినాదంతో పార్టీ ముందుకు వెళ్తుందని, ఈ ఫైట్‌లో ఉద్యమకారులు, నిరుద్యోగులు, విద్యార్ధులు, రైతులు, కళాకారులు, పేద వర్గాలంతా కాంగ్రెస్ కు మద్ధతు ఇవ్వాలని ఆయన కోరారు. కాంగ్రెస్‌లో ఉన్న స్వేచ్ఛ ఎక్కడా లభించదని ఇతర పార్టీల్లోని లీడర్లంతా ఆలోచించాలని స్పష్టం చేశారు.

Next Story

Most Viewed