తెలంగాణలో కర్ణాటక ఫలితాలు రిపీట్: పొంగులేటి

by Disha Web Desk 2 |
తెలంగాణలో కర్ణాటక ఫలితాలు రిపీట్: పొంగులేటి
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, పెద్దమందడి ఎంపీపీ మెగా రెడ్డి, వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆత్మీయ సమ్మేళనానికి జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరవుతున్నారు. అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించడంతోపాటు, భవిష్యత్‌లో ఏ పార్టీలో చేరాలనే అంశంపైనా ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తుంది.

ఈ సందర్భంగా ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనేందుకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భారీ కన్వాయ్‌తో వనపర్తికి బయలు దేరారు. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలోనూ కర్ణాటక ఫలితాలు రిపీట్ కాబోతున్నాయని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయని కేసీఆర్ సర్కార్‌ను ప్రజలు ఇంటికి పంపడం ఖాయమని తెలిపారు. కేసీఆర్‌ను ఇంటికి పంపాలన్నదే తమ లక్ష్యం కూడా అని పొంగులేటి చెప్పుకొచ్చారు. త్వరలోనే మరికొందరు నేతలు తమతో కలిసి రాబోతున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Next Story