దమ్ముంటే మనం మనం చూసుకుందాం.. దుబాయ్ నుంచి మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వీడియో

by Disha Web Desk 2 |
దమ్ముంటే మనం మనం చూసుకుందాం.. దుబాయ్ నుంచి మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్: కుమారుడు కారు ప్రమాదం కేసుపై బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ స్పందించారు. బుధవారం దుబాయ్ నుంచి ఓ వీడియో విడుదల చేశారు. నా కుమారుడు రహీల్‌ను ఎవరూ అరెస్ట్ చేయలేదు అని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని టీవీల్లో అరెస్ట్ చేసినట్లు చూపిస్తు్న్నారని అసహనం వ్యక్తం చేశారు. నా కొడుకును జైల్లో పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం రాజకీయ కుట్రతోనే కారు ప్రమాదం కేసులో నా కొడుకును ఇరికించారని మండిపడ్డారు. తాను ప్రస్తుతం దుబాయ్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నానని చెప్పారు. పంజాగుట్ట కారు యాక్సిడెంట్‌ ఘటనలో 21 కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. రాజకీయంగా మనం మనం చూసుకుందాం.. కానీ ఇందులోకి పిల్లలను లాగొద్దు, వారిని ఇబ్బంది పెట్టొద్దు అని సూచించారు.

నా కుమారుడికి ఏం జరిగినా పోలీసు ఉన్నతాధికారులదే బాధ్యత అని అన్నారు. తనకు తెలంగాణ పోలీసులపై నమ్మకం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. తప్పు చేశాడని తేలితే దేనికైనా సిద్ధమే.. బహిరంగంగా ఉరి తీసినా ఓకే అన్నారు. కానీ, చేయని తప్పును రుద్దాలనే కుట్ర జరుగుతోంది. కేసుపై న్యాయ పోరాటానికి సిద్ధమని ప్రకటించారు. కాగా, హైదరాబాద్‌లోని ప్రజా భవన్ వద్ద కారు ప్రమాదం కేసులో అరెస్టై, ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉంటున్న బీఆర్‌ఎస్ మాజీ ఎంఎల్‌ఏ షకీల్ కుమారుడు రహీల్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. రహీల్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.20 వేలు, 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను పాటించాలని అతడికి సూచించింది.

Next Story

Most Viewed