తీవ్ర విషాదం.. మాజీ ఎమ్మెల్యే సత్యవతి కన్నుమూత

by Disha Web Desk 2 |
తీవ్ర విషాదం.. మాజీ ఎమ్మెల్యే సత్యవతి కన్నుమూత
X

దిశ, భద్రాచలం: ఎన్నికల వేళ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకురాలు కుంజా సత్యవతి కన్నుమూశారు. సోమవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో భద్రాచలంలోని ఆమె నివాసంలో తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఆమె మృతిపట్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముఖ్య నేతలు దిగ్భ్రాంతికి గురయ్యారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలుపుతున్నారు. కాగా, 2009 ఎన్నికల్లో భద్రాచలం నుంచి సత్యవతి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ మరణానంతర పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ఆ తరువాత వైఎస్ఆర్ సీపీలోకి చేరారు. కొన్నాళ్ల తరువాత మళ్లీ కాంగ్రెసులోకి వెళ్లారు. కొంతకాలం నుంచి ఆ పార్టీతోనూ, ఇతర ఏ పార్టీతోనూ సంబంధం లేకుండా ఉన్నారు. చివరకు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.



Next Story

Most Viewed