BRS సర్కార్‌పై మాజీ మంత్రి జూపల్లి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
BRS సర్కార్‌పై మాజీ మంత్రి జూపల్లి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్‌ సర్కార్‌పై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ రెబల్ నాయకుడు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్తగూడెంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో జూపల్లి మాట్లాడుతూ.. తిండి లేకపోయినా ఉంటా కానీ, ఆత్మగౌరవం దెబ్బతింటే భరించలేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని సమాజానికి చెబుదామనే ఖమ్మం వచ్చినట్లు తెలిపారు. ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంచి పనిచేస్తున్నారని కితాబిచ్చారు.

తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానో లేదో పార్టీనే చెప్పాలని అనూహ్య వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ప్రాధాన్యత కోసం ఏనాడూ తాను పాకులాడలేదని అన్నారు. తనకు పదవులపైనా ఆశ లేదని తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని అసహనం వ్యక్తం చేశారు. సమాజంలో మార్పు రావాలని కోరుకున్నారు. రాష్ట్రంలో ఉద్యమకారులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, మాతో ఎవరు కలిసి వచ్చినా పనిచేస్తామని అన్నారు. సభా వేదికపై మరిన్ని విషయాలు చెబుతానంటూ ఆసక్తి రేకెత్తించాడు.

Next Story

Most Viewed