మాజీ మంత్రి మృతి.. సంతాపం వ్యక్తం చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

by Dishafeatures2 |
మాజీ మంత్రి మృతి.. సంతాపం వ్యక్తం చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి సి.రామచంద్రారెడ్డి కొద్దిసేపటి క్రితం నిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కొన్ని రోజుల క్రితం కుటుంబ సభ్యులు నిమ్స్ లో చేర్పించారు. అయితే ఈ రోజు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయన మృతి చెందారు. కాగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రామచంద్రారెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండ్ సార్లు మంత్రిగా పని చేశారు.

కాగా మాజీ మంత్రి రామచంద్రారెడ్డి మృతిపట్ల టీపీసీసీ చీఫ్ చీఫ్ రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని అన్నారు. జీవిత కాలం ప్రజా సేవకు అంకితమయ్యారని.. నిజాయితీ, క్రమశిక్షణతో రాజకీయాలు చేసిన గొప్ప వ్యక్తి రామచంద్రారెడ్డి అని ఆయన కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా అని రేవంత్ రెడ్డి తెలిపారు.



Next Story

Most Viewed