NTR రాజకీయాల్లోకి వచ్చింది అందుకోసమే: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
NTR రాజకీయాల్లోకి వచ్చింది అందుకోసమే: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మార్చి 29 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రను తిరగరాసిన రోజు అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయడు అన్నారు. బుధవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగిన టీడీపీ 41వ ఆవిర్భావ సభకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారం కావాలని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాలేదని తెలిపారు. తెలుగు ప్రజల రుణం తీర్చుకోవడానికే తెలుగు దేశం పార్టీ పెట్టారని చెప్పారు.

తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశమని ఎన్టీఆర్ చెప్పారన్నారు. తెలుగుజాతి వసుదైక కుటుంబంగా ఉండటం మనందరి అదృష్టమని అన్నారు. ఎన్టీఆర్ తీసుకువచ్చిన పాలన సంస్కరణలు చరిత్రలోనే ఎక్కడ లేవని చెప్పారు. ఎక్కడ పసుపు ఉంటే అక్కడ శుభసూచకమని అన్నారు. అందరి అవసరం కోసం.. అందరి కోసం తెలుగుదేశం పార్టీ అని కీలక వ్యాఖ్యలు చేశారు. చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ ఉంటుందని పేర్కొన్నారు.

Also Read..

నిన్న రాజయ్య.. నేడు దుర్గం చిన్నయ్య


Next Story