HYD: కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

by Disha Web Desk 2 |
HYD: కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే బింగి మచ్చేందర్ రావు(94) కన్నుమూశారు. వయోభారంతో శుక్రవారం సాయంత్రం ఆల్వాల్‌లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలిసిన తెలుగు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా, 1978-1983లో జనతా పార్టీ తరపున ఎమ్మెల్యేగా మచ్చేందర్ రావు గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి ముత్తు స్వామిపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆ తరువాత చోటుచేసుకున్న పరిస్థితుల కారణంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం 1983లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి అయిన ఎన్ఏ కృష్ణ చేతిలో ఓడిపోయాడు.




Next Story

Most Viewed