ఫోర్జరీ కేసు : ఎమ్మెల్యే ముత్తి రెడ్డి కంటతడి

by Disha Web Desk 4 |
ఫోర్జరీ కేసు : ఎమ్మెల్యే ముత్తి రెడ్డి కంటతడి
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోర్జరీ కేసు అంశంపై తాజా జనగామ ఎమ్మె్ల్యే ముత్తిరెడ్డి స్పందించారు. తన కూతురికి ఇచ్చిన ఆస్తి తన పేరు మీదనే ఉందన్నారు. కేవలం లీజ్ అగ్రిమెంట్ మాత్రమే పొడిగించామన్నారు. నా ఇంటి సమస్యను ప్రజాజీవితానికి ఆపాదించడం సరికాదన్నారు. తన మనోస్థైర్యం దెబ్బతీసేందుకు కొంతమంది కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తాజా అంశాన్ని రాజకీయ ప్రత్యర్థులు పావుగా వాడుకుంటున్నారని తెలిపారు. ఇది నా కుటుంబ సమస్య అని.. కూర్చొని మాట్లాడుకుంటామన్నారు. మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా భావోద్వేగానికి గురైన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కంటతడి పెట్టారు.



Next Story

Most Viewed