Food Poisoning: ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 50 మంది విద్యార్థులకు అస్వస్థత, ఐదుగురి పరిస్థితి విషమం

by Kema Shiva Kumar |   (  Updated:2024-11-20 14:35:46  IST  )

ప్రభుత్వం పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 50 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన షాకింగ్ ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది.

Food Poisoning: ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 50 మంది విద్యార్థులకు అస్వస్థత, ఐదుగురి పరిస్థితి విషమం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 50 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన షాకింగ్ ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మాగనూర్‌లో మధ్యాహ్న భోజనం ఆరగించిన 50 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. దీంతో ఫుడ్ పాయిజన్ అయనట్లుగా గుర్తించిన ఉపాధ్యాయులు, సిబ్బంది హుటాహుటిన విద్యార్థులను చికిత్స నిమిత్తం మక్తల్ ఆసుపత్రికి తరలించారు. అందులో ప్రస్తుతం ఐదుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story