TPCC చీఫ్‌తో గద్దర్ భేటీ.. తానే బాధ్యత తీసుకుంటానని రేవంత్ హామీ

by Disha Web Desk 2 |
TPCC చీఫ్‌తో గద్దర్ భేటీ.. తానే బాధ్యత తీసుకుంటానని రేవంత్ హామీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ప్రజాగాయకుడు గద్దర్ మంగళవారం గాంధీభవన్‌లో భేటీ అయ్యారు. నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టేలా ఢిల్లీ పెద్దలకు సూచించాలని రేవంత్‌రెడ్డికి వినతిని అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక బృహత్తర బాధ్యతను ప్రజా గాయకుడు గద్దర్ తనకు అప్పగించాలని, వారి వినతిని చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ తరపున ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఆ నివేదికను తీసుకుని తానే బాధ్యత తీసుకుని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని వివరించారు. ఆ తీర్మాణాన్ని కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ‌కి అందజేస్తామని వెల్లడించారు. పార్లమెంట్‌లో ఈ అంశంపై చర్చ జరిపి నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.



Next Story

Most Viewed