- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూసీ వెంట ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్టుపై ఫోకస్... అసెన్డ్ భూములే టార్గెట్గా చర్యలు
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా నాగోల్-గౌరెళ్లి మార్గంలో ల్యాండ్ పూలింగ్ ద్వారా నిధులు సమీకరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ (Musi) పునరుజ్జీవనం ప్రాజెక్టుతోపాటు ల్యాండ్ పూలింగ్ (Land Pooling) ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టింది. 55 కిలోమీటర్ల మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టులో నాగోల్ నుంచి గౌరెళ్లి మార్గంలో అత్యధిక భూములు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించినట్టు తెలిసింది. దీంతోపాటు ఇతర ప్రాంతాల్లో సైతం భూములను గుర్తించి ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్టులను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ల్యాండ్ పూలింగ్ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టాన్ని రూపొందించింది. దీనికి సంబంధించిన ముసాయిదాను ఇప్పటికే ప్రభుత్వానికి హెచ్ఎండీఏ అందజేసింది.
16 కిలోమీటర్ల మార్గంలో..
భూసేకరణ తక్కువగా ప్రాంతాలను ఎంచుకుని ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే గండిపేట్పేట్, హిమాయత్ సాగర్ నుంచి లంగర్ హౌస్ (గాంధీ సరోవర్ ప్రాజెక్టు) వరకు మొదటి దశలో 21 కిలోమీటర్ల మార్గంలో ప్రాజెక్టు పనులు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం రెండో దశలో నాగోల్ నుంచి గౌరెళ్లి వరకు చేపట్టాలని 16 కిలోమీటర్లకు వంద రోజుల్లో డీపీఆర్ రూపొందించాలని నిర్ణయించింది. 55 కిలోమీటర్ల ప్రాజెక్టులో 37 కిలోమీటర్ల రెండు దశలోనే పూర్తి చేయాల్సి ఉంది. అయితే నాగోల్ నుంచి గౌరెళ్లి మార్గంలో ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్టులను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ బాధ్యతలను హెచ్ఎండీఏకు అప్పగించింది. మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు కోసం బ్యాంకు రుణాల ద్వారా నిధులను సమీకరిస్తున్న ప్రభుత్వం తిరిగి రాబట్టుకోవడానికి ప్రణాళికలను రూపొందించింది. అందులో భాగంగానే మూసీ మార్గంలోనే ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్టులను చేపట్టి నిధులు సమీకరించాలని అనుకుంటోంది.
అసైన్డ్ భూముల గుర్తింపు:
నాగోల్-గౌరెళ్లి వరకు చేపట్టే మూసీపునరుజ్జీవనం ప్రాజెక్టుతో పాటు ఈ 16 కిలోమీటర్ల మార్గంలో ఎక్కడెక్కడ అసైన్డ్ భూములు ఉన్నాయి? ఏమైనా ప్రభుత్వ భూములు ఉన్నాయా? రైతులకు సంబంధించిన పట్టా భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయి? గుర్తించేందుకు హెచ్ఎండీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా బోడుప్పల్, ఫీర్జాదిగూడ, ప్రతాప్ సింగారం, గౌరెళ్లి ప్రాంతాల్లో అసైన్డ్ భూములు ఎక్కవగా ఉన్నాయని అధికారుల అంచనా. ఆ భూముల్లో ల్యాండ్ పూలింగ్ చేపట్టాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీటితోపాటు ఎంఆర్డీసీఎల్కు కేటాయించిన 734 ఎకరాల భూముల్లో ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్టు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఈసా నది సమీపంలోని గండిపేట మండలం హిమాయత్ సాగర్, కిస్మత్పూర్, రాజేంద్రనగర్ మండలానికి చెందిన ప్రేమావతిపేట్, బుద్వేల్ ప్రాంతాల్లో ఉన్న టీఈఈఆర్ఎల్, ఐఐపీహెచ్, ఇతర సంస్థలకు కేటాయించిన భూములతోపాటు శంషాబాద్ మండలం కొత్వాల్గూడ పరిధిలో హెచ్ఎండీఏ లేఅవుట్ కోసం కేటాయించిన భూమిని మూసీకి బదలాయించారు. వీటిల్లో ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్టులు చేపట్టనున్నారు.






