తెలంగాణ మీడియా అకాడమీ తొలి గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం

by Yella Dhawani Reddy |   (  Updated:2025-02-20 16:27:42  IST  )

తెలంగాణ మీడియా అకాడమీ తొలి గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం గురువారం హైదరాబాద్ నాంపల్లిలోని మీడియా అకాడమీ భవనంలో ఛైర్మన్ కె. శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన జరిగింది.

తెలంగాణ మీడియా అకాడమీ తొలి గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మీడియా అకాడమీ తొలి గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం గురువారం హైదరాబాద్ నాంపల్లిలోని మీడియా అకాడమీ భవనంలో ఛైర్మన్ కె. శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన జరిగింది. వర్కింగ్ జర్నలిస్టులకు శిక్షణ తరగతులు నిర్వహించడం, వర్కింగ్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ ఫండ్ కింద మరణించిన వర్కింగ్ జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించడం వంటి కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు, ప్రభుత్వ సహకారంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'న్యూస్‌ పేపర్స్ ఆర్కైవ్స్'ను కొనసాగించాలని పాలక మండలి ఏకగ్రీవంగా నిర్ణయించింది.

ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి కె. ధర్మయ్య, ఐ అండ్ పిఆర్ శాఖ జాయింట్ డైరెక్టర్ డి.ఎస్. జగన్, డాక్టర్ సతీష్ కుమార్ తల్లాడి, డాక్టర్ యాదగిరి కంభంపాటి, హైదరాబాద్‌ దూర దర్శన్ కేంద్రం ప్రోగ్రామ్ ఇన్‌చార్జ్ పి.వి. సత్యనారాయణ, ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రామ్స్ హెడ్ ఎస్. రమేష్ సుంకసారి, తెలంగాణ మీడియా అకాడమీ కార్యదర్శి ఎన్.వెంకటేశ్వరరావు ఈ సమావేశానికి హాజరయ్యారు. హైదరాబాద్‌లోని చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలోని జర్నలిజం విభాగాధిపతి బి.వి. కృష్ణాజీ రావు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు.

Next Story