అమెరికాలో కాల్పులు.. తెలంగాణ యువతి దుర్మరణం

by Disha Web Desk 4 |
అమెరికాలో కాల్పులు.. తెలంగాణ యువతి దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలోని టెక్సాస్‌లో సైకో జరిపిన కాల్పుల్లో తెలంగాణ యువతి దుర్మరణం చెందడం విషాదం మిగిల్చింది. చనిపోయిన యువతిని తాటికొండ ఐశ్వర్యగా అక్కడి పోలీసులు గుర్తించారు. చనిపోయిన ఐశ్వర్య రంగారెడ్డి జిల్లా జడ్జి నర్సిరెడ్డి కుమార్తె అని తెలిసింది. సైకోల కాల్పుల్లోనే ఐశ్వర్య మరణించినట్లు ఎఫ్‌బీఐ నిర్ధారించింది. ఐశ్వర్య పర్ ఫెక్ట్ జనరల్ కాంట్రాక్టర్స్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే నిన్న టెక్సాస్ లోని అలెన్ మాల్ లో దండగులు జరిపిన కాల్పుల్లో మొత్తం 8 మంది చనిపోగా తాజా కాల్పులతో అమెరికాలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Next Story

Most Viewed