Breaking: తెలంగాణలో సన్నబియ్యం పథకం ప్రారంభం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-03-30 18:47:49  IST  )

తెలంగాణలో సన్నబియ్యం పథకం ప్రారంభమైంది...

Breaking: తెలంగాణలో సన్నబియ్యం పథకం ప్రారంభం.. మంత్రి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో సన్నబియ్యం పథకం(Fine Rice Scheme) ప్రారంభమైంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌(Suryapet district Huzurnagar)లో ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు(Ration Cards) ఇస్తామన్నారు. గత ప్రభుత్వం రేషన్ ఇవ్వలేదని మండిపడ్డారు. తాము మూడు రంగుల కార్డులను అందిస్తామని తెలిపారు. రేషన్‌కార్డుదారుల్లో ఒక్కొక్కరికి 6 కిలోల సన్నబియ్యం ఇస్తామన్నారు. ఇక 80 శాతానికి పైగా జనానికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. తెలంగాణలో సన్నబియ్యం పథకం ప్రారంభమైందని...గత ప్రభుత్వం ఎలా వేధించిందో అందరికీ తెలుసు అని మండిపడ్డారు. ఇప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా తిరిగి ప్రతీకారం తీర్చుకుంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.

Next Story