- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PC Ghosh: ఈ నెల 31న కాళేశ్వరం నివేదిక
కాళేశ్వరం తుది నివేదిక జస్టిస్ పీసీ ఘోష్ ఫినిషింగ్ టచ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కుంగుబాటు, అవకతవకలపై న్యాయ విచారణ కోసం జస్టిస్ పీసీ ఘోష్ (Justice PC Ghosh) నేతృత్వంలో ఏర్పాటైన కాళేశ్వరం కమిషన్ (Kaleswaram Commission) విచారణ తుది అంకానికి చేరుకుంది. ఈ విచారణకు సంబంధించిన తుది నివేదిక ప్రభుత్వానికి సమర్పించేందుకు పీసీ ఘోష్ కమిషన్ సర్వం సిద్ధం చేసుకుంటోంది. ఈ నెల 31న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పదవీ కాలం ముగియనుంది. దాంతో అదే రోజున పీసీ ఘోష్ కమిషన్ వద్ద నుంచి తుది రిపోర్ట్ ను ఇరిగేషన్ శాఖ తీసుకోనుంది. నిన్నే కోల్ కతా నుంచి హైదరాబాద్ చేరుకున్న కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్.. ప్రభుత్వానికి తుది నివేదిక ఇచ్చే ముందు లీగల్ అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. న్యాయపరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఫైనల్ రిపోర్ట్ ను పీసీ ఘోష్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
Next Story






