HYD : విషాదం.. రైలు కింద పడి తండ్రి, కుమార్తె సూసైడ్

by Disha Web Desk 4 |
HYD : విషాదం.. రైలు కింద పడి తండ్రి, కుమార్తె సూసైడ్
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: రైలు కింద పడి తండ్రి, కుమార్తె ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ విషాద ఘటన సికింద్రాబాద్ పరిధి చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. జీవితంపై విరక్తితో తండ్రి మల్లేష్(81), కుమార్తె ఉమారాణి(38) సూసైడ్ చేసుకున్నారు. కాగా మృతుడు మల్లేష్ భార్య ఏడాది క్రితం మృతి చెందినట్లు తెలిసింది.

అప్పటినుంచి వారిని పట్టించుకునేవారు లేకుండా పోయారు. దాంతో బుధవారం మల్లేష్ కూతురిని వెంటబెట్టుకుని మౌలాలి రైల్వే ట్రాక్ వద్దకు వచ్చాడు. ఆ తరువాత ఇద్దరు కలిసి రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. డెడ్ బాడీలను గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Next Story

Most Viewed