ఏటూరు నాగారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్

by Disha Web Desk 4 |
ఏటూరు నాగారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్
X

దిశ, ఏటురు నాగారం: ములుగు జిల్లా ఏటూరు నాగారం ఎన్ హెచ్163( నేషనల్ హైవే) పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే వెంకటాపురానికి చెందిన పోలిన శ్రీనివాస్, తన కూతురు పోలిన శృతి‌తో కలిసి పని నిమిత్తం కారులో ఏటూరు నాగారం వస్తుండగా రొయ్యూరు శంకర్ రాజు పల్లి మూల మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాల్వా టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. కూతురు శృతికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.



Next Story

Most Viewed