ఆర్గానిక్ సర్టిఫికేషన్‌పై రైతులకు అవగాహన కల్పించాలని.. వ్యవసాయ శాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్​

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో ప్రకృతి సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులకు ధ్రువీకరణ సేవలు అందించాలని, ఆర్గానిక్ సర్టిఫికేషన్‌పై రైతులకు అవగాహన కల్పించాలని, సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రాడక్ట్స్‌పై వినియోగదారులకు కావాల్సిన వివరాలు తెలియజేయాలని వ్యవసాయ శాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్ తెలిపారు.

ఆర్గానిక్ సర్టిఫికేషన్‌పై రైతులకు అవగాహన కల్పించాలని.. వ్యవసాయ శాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్​
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రకృతి సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులకు ధ్రువీకరణ సేవలు అందించాలని, ఆర్గానిక్ సర్టిఫికేషన్‌పై రైతులకు అవగాహన కల్పించాలని, సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రాడక్ట్స్‌పై వినియోగదారులకు కావాల్సిన వివరాలు తెలియజేయాలని వ్యవసాయ శాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్ తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో విత్తన ధృవీకరణ అధికారుల అసోసియేషన్​డైరీ, క్యాలెండర్​ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైజింగ్ 2047 కు అనుగుణంగా రాష్ట్రంలో విత్తన ఎగుమతులను మరింత పెంచాలని, అందుకోసం తగిన ప్రణాళిక తయారు చేసుకోవాలని అన్నారు. తెలంగాణలో విత్తన ఎగుమతులకు మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

Next Story