- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హృదయాలను కదిలిస్తున్న రైతన్న రోదన!
సాగుకు నీళ్లు విడుదల చేయాలని ఓ రైతన్న నడిరోడ్డుపై ఏడుస్తున్న వీడియో అందరి హృదయాలను కలిచివేస్తుంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: సాగుకు నీళ్లు విడుదల చేయాలని ఓ రైతన్న నడిరోడ్డుపై ఏడుస్తున్న వీడియో అందరి హృదయాలను కలిచివేస్తుంది. మంథని పట్టణ కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద ఎండిపోతున్న వరి మొక్కలను చూపిస్తూ ఓ రైతు కంటతడి పెడుతూ రోదిస్తున్నారు. భూగర్భ జలాలు అట్టడుగుకు చేరడం, కాలువలు, బావుల్లో నీరు అడుగంటి పోవడంతో ఆరుగాలం పండించిన వరి పంట ఎండిపోతుందని మంథనికి చెందిన ఆ రైతన్న గురువారం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఇకనైనా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని రైతు వేడుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రైతును చూసి నెటిజన్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story






