సీజ్ చేసిన న‌ల్లబెల్లం రైతుల‌కు త‌క్కువ ధ‌ర‌కు ఇవ్వాలి.. రైతు క‌మిష‌న్ చైర్మన్ కోదండ‌రెడ్డి

by Ramesh Naini |

రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు త‌నిఖీ చేసి సీజ్ చేస్తున్న న‌ల్లబెల్లాన్ని రైతుల‌కు త‌క్కువ ధ‌ర‌కు ఇవ్వాల‌ని రైతు క‌మిష‌న్ చైర్మన్ కోదండరెడ్డి కోరారు.

సీజ్ చేసిన న‌ల్లబెల్లం రైతుల‌కు త‌క్కువ ధ‌ర‌కు ఇవ్వాలి.. రైతు క‌మిష‌న్ చైర్మన్ కోదండ‌రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: (State Excise Department) రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు త‌నిఖీ చేసి సీజ్ చేస్తున్న న‌ల్లబెల్లాన్ని రైతుల‌కు త‌క్కువ ధ‌ర‌కు ఇవ్వాల‌ని (Farmers Commission Chairman) రైతు క‌మిష‌న్ చైర్మన్ కోదండరెడ్డి (Kodanda Reddy) కోరారు. రైతులు (Black jaggery) న‌ల్లబెల్లాన్ని సేంద్రియ ఎరువుల త‌యారీలో వాడుతున్నార‌ని, దీన్ని దృష్టిలో పెట్టుకొని సీజ్ చేసిన న‌ల్లబెల్లాన్ని రైతుల‌కు ఇవ్వడంతో సాగుకు సాయం చేసిన‌ట్లేనన్నారు. మంగళవారం స‌చివాల‌యంలో ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావుతో స‌మావేశ‌మ‌య్యారు. ఇటీవల రైతు క‌మిష‌న్ ఉమ్మడి న‌ల్గొండ జిల్లా ప‌ర్యట‌న చేసిన స‌మ‌యంలో చాలా మంది రైతులు న‌ల్లబెల్లంతో సేంద్రియ ఎరువు త‌యారు చేసే విష‌యాన్ని క‌మిష‌న్ దృష్టికి తెచ్చిన‌ట్లు మంత్రికి వివ‌రించారు. ఎక్సైజ్ శాఖ అధికారులు సీజ్ చేసి కొంత‌కాలానికి దాన్ని అడ‌వుల్లో లేదంటే ఇత‌ర ప్రాంతాల్లో పార‌బోస్తున్నారు. అలా వృధాగా పార‌బోయ‌డం కంటే రైతుల‌కు ఇస్తే సేంద్రియ ఎరువు ఉప‌యోగానికి వాడుకునే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. రైతు క‌మిష‌న్ ప్రతిపాద‌న‌కు ఎక్సైజ్ శాఖ మంత్రి సానుకూలంగా స్పందించిన‌ట్లు చైర్మన్ కొదండ‌రెడ్డి తెలిపారు. మంత్రిని క‌లిసిన వారిలో క‌మిష‌న్ స‌భ్యులు భూమి సునీల్ తోపాటు క‌మిష‌న్ మెంబ‌ర్ సెక్రెట‌రీ గోపాల్, కమిషన్ అధికారి హరివెంకట ప్రసాద్, ఆద‌ర్శ రైతు కోటిరెడ్డి ఉన్నారు.

Next Story