బాంచన్ మీ కాళ్ళు మొక్కుతా వడ్లు కొనండి! పోలీసుల కాళ్ళు మొక్కిన మ‌హిళా రైతు..

by Disha Web Desk 14 |
బాంచన్ మీ కాళ్ళు మొక్కుతా వడ్లు కొనండి!  పోలీసుల కాళ్ళు మొక్కిన మ‌హిళా రైతు..
X

దిశ, డైనమిక్ బ్యూరో: జనగామ మార్కెట్ యార్డ్ లో వడ్లు కొనాలంటూ తాజాగా రైతుల ఆందోళన చేపట్టారు. జ‌న‌గామ మార్కెట్‌ను గ‌త 15 రోజులుగా తెర‌వ‌లేదంటూ రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వ‌డ్ల‌ను కొనుగోలు చేసేందుకు ఎవ‌రూ ముందుకు రావ‌డం లేద‌ని రైతులు తెలిపారు. ఈ క్ర‌మంలో ప‌లు సంఘాలు రైతుల‌కు మ‌ద్ద‌తుగా ధ‌ర్నా నిర్వ‌హించాయి. దీంతో జ‌న‌గామ మార్కెట్ వ‌ద్ద‌కు పోలీసులు చేరుకోని వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ సంద‌ర్భంగా ఓ మ‌హిళా రైతు వ‌డ్లు కొనాల‌ని కోరుతూ.. పోలీసుల కాళ్ళు మొక్కింది. ఇక క్వింటాల్‌కు రూ. 500 బోన‌స్ ఇవ్వాల‌ని రైతులు, నాయ‌కులు డిమాండ్ చేశారు. మ‌హిళా రైతు పోలీసుల కాళ్ళు మొక్కిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు. ‘అన్నం పెట్టే అన్నదాతలు బాంచన్ నీ కాళ్ళు మొక్కుతా అనే స్థితికి వచ్చారంటే దీనికంటే దౌర్భాగ్యపు దేశం ఏది ఉండదు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఒక ఏడాది రైతులు పంటలు పండించకుండ ఉంటే వారి విలువ తెలుస్తుందని మరో నెటిజన్ కామెంట్ చేశారు. మరోవైపు ఈ వీడియో పై బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ‘రైతును రాజుని చేసిన మాజీ సీఎం కేసీఆర్, మళ్లా బాంచన్‌ నీ కాళ్ళు మొక్కుతా అనే స్థితికి తెచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రైతు ద్రోహి రేవంత్‌ను బొంద పెడదాం.. రైతు బంధు కేసీఆర్‌ను గెలిపిద్దాం’ అని బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది.



Next Story