ఇంజిన్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య.. నిలిచిన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్

by Kema Shiva Kumar |

ఇంజిన్‌‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ (Falaknuma Express) ఆగిపోయిన ఘటన నల్గొండ జిల్లా పరిధిలోని మిర్యాలగూడ (Miryalaguda)లో చోటుచేసుకుంది.

ఇంజిన్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య.. నిలిచిన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంజిన్‌‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ (Falaknuma Express) ఆగిపోయిన ఘటన నల్గొండ జిల్లా పరిధిలోని మిర్యాలగూడ (Miryalaguda)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హౌరా (Howrah) నుంచి సికింద్రాబాద్ జంక్షన్‌ (Secunderabad Junction)కు వెళ్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ మిర్యాలగూడ స్టేషన్ దాటిన వెంటనే ఇంజిన్ భాగంలో టెక్నికల్ సమస్య తలెత్తింది. దీంతో రైలు ముందుకు కదలక మొరాయించింది. ఈ పరిణామంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోకో‌పైలట్ ఉన్నతాధికారులకు సమాచారం అందజేయడంతో.. మరో ఇంజిన్ తెప్పించేందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు.

Next Story