- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pashamailaram incident: పాశమైలారం ఘటనపై రంగంలోకి నిపుణుల కమిటీ
by Prasad Jukanti |
సిగాచి పరిశ్రమకు నిపుణుల కమిటీ చేరుకుంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తీవ్ర విషాదం నింపిన సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో (Sigachi Industry) పేలుడు ఘటనపై నిపుణుల కమిటీ రంగంలోకి దిగింది. ఈ పేలుడు ఘటనపై అధ్యయం చేసి నివేదిక ఇవ్వాలని నలుగురు నిపుణులతో కూడిన కమిటీని నిన్న ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిదే. ఈ మేరకు ఇవాళ కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు, సభ్యులు ప్రతాప్, సూర్యనారాయణ, సంతోష్ పేలుడు సంభవించిన పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. అక్కడ తాజా పరిస్థితులను పరిశీలించారు. అయితే సిగాచి పరిశ్రమలో ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు విశ్లేషించడంతో పాటు కార్మికుల భద్రతకు నిబంధనలు పాటించారా? లేదా అనే విషయాలపై ఆరా తీయనున్నది.ఈ పేలుడుకు గల కారణాలు ఏంటి, ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ నెల రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నది.
Next Story






