- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెంగళూరుకి సీఎం రేవంత్ రెడ్డి.. కర్ణాటక కాంగ్రెస్ పరిణామాల నేపథ్యంలో సీఎం టూర్ పై ఉత్కంఠ
by Ramesh Naini |
సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరుకి వెళ్లారు. శనివారం రాత్రి ఆయన శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరుకి చేరుకున్నారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరుకి వెళ్లారు. శనివారం రాత్రి ఆయన శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరుకి చేరుకున్నారు. ఈ పర్యటన కర్ణాటక కాంగ్రెస్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం బెంగళూరు టూర్ ఉత్కంఠగా మారింది. కర్ణాటకలో సీఎం పదవి కోసం సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య నెలకొన్న రాజకీయ పరిణామాల క్రమంలో సీఎం రేవంత్రెడ్డి అధిష్టానం ఆదేశాల మేరకు అక్కడికి వెళ్లి పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలు జరుపనున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. సీఎం రేవంత్ రెడ్డి నేడు పుట్టపర్తికి వెళ్లనున్నారు. ఉదయం పుట్టపర్తిలో ఆయన శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు.
Next Story






