యూరియా అందించలేని అసమర్థ ప్రభుత్వమిది: కవిత

by Ajay Maddhiboyina |   (  Updated:2026-01-21 10:38:09  IST  )

రైతుల‌కు యూరియా అందించ‌లేద‌ని అస‌మ‌ర్థం ప్ర‌భుత్వం ఇది అంటూ ఎక్స్ వేధిక‌గా మాజీ ఎమ్మెల్సీ క‌విత ప్ర‌భుత్వంపై ఆగ్రహం వ్య‌క్తం చేశారు. యూరియా కోసం రైతులు క‌ష్టాలు ప‌డుతుంటే నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా పెద్ద‌కొత్త‌ప‌ల్లి మండ‌లం ముష్టిప‌ల్లిలో యూరియా స‌ర‌ఫ‌రా చేయ‌కుండా వైదిక‌కు తాళాలు వేసుక‌న్నార‌ని మండిప‌డ్డారు.

యూరియా అందించలేని అసమర్థ ప్రభుత్వమిది: కవిత
X

దిశ‌, వెబ్ డెస్క్: రైతుల‌కు యూరియా అందించ‌లేద‌ని అస‌మ‌ర్థం ప్ర‌భుత్వం ఇది అంటూ ఎక్స్ వేధిక‌గా మాజీ ఎమ్మెల్సీ క‌విత ప్ర‌భుత్వంపై ఆగ్రహం వ్య‌క్తం చేశారు. యూరియా కోసం రైతులు క‌ష్టాలు ప‌డుతుంటే నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా పెద్ద‌కొత్త‌ప‌ల్లి మండ‌లం ముష్టిప‌ల్లిలో యూరియా స‌ర‌ఫ‌రా చేయ‌కుండా వైదిక‌కు తాళాలు వేసుక‌న్నార‌ని మండిప‌డ్డారు. యాసంగి పంట‌ల‌కు యూరియా కావాల‌ని రైతులు తండ్లాడుతుంటే అందుబాటులో ఉన్న యూరియా స‌కాలంలో అందించ‌లేని ఈ ప్ర‌భుత్వానికి అన్న‌దాత‌ల చేతిలో గుణపాఠం త‌ప్ప‌దు అని హెచ్చ‌రించారు.

ఇదిలా ఉంటే క‌విత బీఆర్ఎస్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర‌వాత జాగృతిని బ‌లోపేతం చేస్తున్నారు. ఇప్పటికే ప‌లు జిల్లాల్లో జాగృతి జ‌నం బాట కార్య‌క్ర‌మంతో పాద‌యాత్ర చేసి ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. అంతే కాకుండా జాగృతి నేత‌ల‌తో వ‌రుస స‌మావేశాలు నిర్వ‌హిస్తూ ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ఇటీవ‌ల మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కవిత పార్టీ త‌ర‌పున అభ్య‌ర్థులు పోటీ చేస్తార‌ని వార్త‌లు వచ్చినా ఆమె వాటని ఖండించారు. జాగృతిని పూర్తిగా రాజ‌కీయ‌పార్టీగా మార్చ‌లేద‌ని చెప్పారు.

READ MORE .....

Flash : మున్సిపల్ ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన కవిత.. ఫోన్ ట్యాపింగ్ కేసుపై కీలక వ్యాఖ్యలు

Next Story