డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

by Taduka Kalyani |

డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేస్తోంది.

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
X

దిశ, శేరిలింగంపల్లి : డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేస్తోంది. మాదాపూర్ శిల్పకళా వేదికలో ఈగల్ ఫోర్స్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన "పిల్లల భద్రత – డ్రగ్స్‌కు అడ్డుకట్ట" కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, రాష్ట్ర డీజీపీ, నగర పోలీస్ కమిషనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రగ్స్ వ్యతిరేక ప్రచారానికి ప్రత్యేక అవేర్‌నెస్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలకు మరింత వేగం పెంచుతోందని అన్నారు. శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల్లో, ముఖ్యంగా యువతలో మాదకద్రవ్యాలపై చైతన్యం పెంపొందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా విద్యార్థులు, యువత, తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ప్రచార వాహనాలను ప్రారంభించారు. ఈ వాహనాలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ డ్రగ్స్ దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నాయి. డ్రగ్స్ రహిత తెలంగాణ సాధనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, అనుమానాస్పద మాదకద్రవ్యాల కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు.

Next Story