'మన్ కీ బాత్' లోని ప్రతి అంశం ప్రజా ఉద్యమంగా మారింది: ప్రధాని మోడీ

by Disha Web Desk 12 |
మన్ కీ బాత్ లోని ప్రతి అంశం ప్రజా ఉద్యమంగా మారింది: ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ 'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్‌ ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించారు. ఆదివారం జరిగిన 100వ ఎపిసోడ్ ప్రధాని మోడీ కీలక విషయాలను ప్రస్తావించారు. ప్రధాని మనసులో మాటాగా రేడియో ప్రోగ్రాం రూపంలో వచ్చే మోడీ సందేశం ప్రపంచ వ్యాప్తంగా ప్రసంగిస్తారు. అయితే ఈ క్రమంలో మోడీ 'మన్ కీ బాత్' లో తాను ప్రసంగించిన ప్రతి అంశం ఓ ప్రజా ఉద్యమంగా మారిందని మోడీ చెప్పుకొచ్చారు. ఇందుకు 'బేటీ బచావో బేటీ పఢావో', 'స్వచ్ఛ భారత్' ఉద్యమం, 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' లను ఉదాహరణగా చెప్పుకొచ్చారు. అలాగే తాను ప్రస్తావించిన ప్రతి అంశంలోనూ ప్రజలు పాల్గొన్నందుకు ప్రతి ఒక్క పౌరునికి ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు.



Next Story

Most Viewed