వేముల‌వాడ లడ్డూ ఘ‌ట‌న‌పై మంత్రి కొండా సురేఖ ఆరా

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-10 13:45:46  IST  )

వేముల‌వాడ లడ్డూ(Vemulawada Laddu) ఘ‌ట‌న‌పై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) ఆరా తీశారు.

వేముల‌వాడ లడ్డూ ఘ‌ట‌న‌పై మంత్రి కొండా సురేఖ ఆరా
X

దిశ, వెబ్‌డెస్క్: వేముల‌వాడ లడ్డూ(Vemulawada Laddu) ఘ‌ట‌న‌పై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) ఆరా తీశారు. ఘ‌ట‌న‌కు సంబంధించిన స‌మ‌గ్ర విష‌యాలు అంద‌జేయాల‌ని ఆలయ అధికారుల‌ను ఆదేశించారు.

ల‌డ్డూపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల‌కు లేఖ రాసిన‌ట్టు ఆలయ ఆలయ ఈఓ ర‌మాదేవి స్పష్టం చేశారు. ఎక్కడా ఎటువంటి లోపం జ‌ర‌గ‌లేద‌ని వెల్లడించారు. అయినా, భ‌క్తుల మ‌నోభావాలను గౌర‌వించే ప్ర‌క్రియ‌లో భాగంగా కీల‌క చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు చెప్పారు. దీంతో ఎటువంటి త‌ప్పిదాలు జ‌ర‌గొద్దని.. జాగ్ర‌త్తగా ఉండాల‌ని మంత్రి కొండా సురేఖ కీల‌క సూచ‌న‌లు చేశారు. ఆల‌య ప్ర‌తిష్ట‌కు సంబంధించిన వ్య‌వ‌హారాల్లో త‌ప్పుడు ప్ర‌చారం చేసేవారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Next Story