సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్‌దే విజయం: పద్మారావు గౌడ్

by Disha Web Desk 2 |
సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్‌దే విజయం: పద్మారావు గౌడ్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుందని ఎమ్మెల్యే, సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్ అన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలే తమకు కుటుంబసభ్యులు అని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదు. దాటవేసే ధోరణి కనిపిస్తోందని విమర్శించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో బీఆర్ఎస్‌దే విజయం అని ధీమా వ్యక్త చేశారు. కాగా, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శనివారం ప్రకటించారు. ఈ మేరకు శాసన సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో చర్చించి అందరి అభిప్రాయం సేకరించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ఎస్ ప్రకటనలో తెలిపారు. పార్టీ సీనియర్ నేతగా నాటి ఉద్యమ కాలం నుంచి నేటి వరకు పార్టీకి విధేయుడుగా ఉన్న పద్మారావు గౌడ్ అందరివాడిగా గుర్తింపు తెచ్చుకున్నారని వెల్లడించారు.


Next Story

Most Viewed