మూడు కార్పొరేషన్ల ఏర్పాటు ఎఫెక్ట్.. పలువురు నాన్-క్యాడర్ అధికారులు బదిలీ

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-11 03:53:05  IST  )

రాష్ట్ర ప్రభుత్వ పాలనా అవసరాల దృష్ట్యా పలువురు నాన్-క్యాడర్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.

మూడు కార్పొరేషన్ల ఏర్పాటు ఎఫెక్ట్.. పలువురు నాన్-క్యాడర్ అధికారులు బదిలీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వ పాలనా అవసరాల దృష్ట్యా పలువురు నాన్-క్యాడర్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావు పేరిట జీవో నంబర్ 204 ద్వారా ఈ బదిలీల ఉత్తర్వులు వెలువడ్డాయి. జీహెచ్‌ఎంసీ యూసీడీ అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న ఎస్. పంకజను బదిలీ చేసి మల్కాజ్‌గిరి హెచ్‌ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్‌బీ (HMWS & SB) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించారు. పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న సామ్రాట్ అశోక్ నామను హైదరాబాద్ హెచ్‌ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్‌బీ (HMWS & SB) ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా నియమించారు. రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్‌గా ఉన్న ఎం.సంతోష్‌ను సైబరాబాద్ హెచ్‌ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్‌బీ (HMWS & SB) ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా బదిలీ చేశారు. ఉపాధి, శిక్షణ శాఖలో అసిస్టెంట్ డైరెక్టరుగా ఉన్న కె.శశికిరణాచారి లోక్‌భవన్ సంయుక్త కార్యదర్శిగా (Joint Secretary) నియమించారు. అయితే, ఈ బదిలీ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది.

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవిర్భావం.. తొలి కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీజన

Next Story