- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో విద్యా వ్యవస్థ సంక్షోభం.. ప్రభుత్వ నిర్లక్ష్యంపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు
తెలంగాణలో విద్యా రంగం ఎదుర్కొంటున్న సంక్షోభంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో స్పందించారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో విద్యా రంగం ఎదుర్కొంటున్న సంక్షోభంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి 2,500కుపైగా విద్యాసంస్థలు మూతపడటం దురదృష్టకరమని, ఈ పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి స్పందన చూపకపోవడం ఆందోళన కలిగిస్తోందని ఆయన విమర్శించారు. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల చెల్లింపుల కోసం ప్రైవేట్ కాలేజీలు మూడు రోజులుగా బంద్ కొనసాగిస్తున్నాయని గుర్తుచేశారు. తన ఎక్స్ (Twitter) వేదికగా బండి సంజయ్ మాట్లాడుతూ, “బీఆర్ఎస్ పాలనలో ఉన్న రెండు సంవత్సరాల బకాయిలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోని రెండు సంవత్సరాల బకాయిలు కలిపి మొత్తం నాలుగు అకడమిక్ సంవత్సరాలుగా విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు” అని అన్నారు.
₹10,500 కోట్ల బకాయిలలో కనీసం సగం మొత్తాన్ని విడుదల చేయమని కాలేజీలు కోరుతున్నప్పటికీ, ప్రభుత్వం దానిని పరిష్కరించకుండా కాంగ్రెస్ అనుకూలులతో కమిటీ ఏర్పాటు చేయడం రాజకీయ నాటకమని ఆయన విమర్శించారు. “దసరాకి ₹600 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి ఎందుకు నిలిపేశారు? ₹1,200 కోట్ల బిల్లులకు టోకెన్లు ఇచ్చి చెల్లింపులు ఎందుకు ఆపేశారు?” అని బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిర్లక్ష్యంగా నడపడం, విద్యా రంగాన్ని దెబ్బతీయడం కాంగ్రెస్ పాలన లక్షణమైందని ఆరోపిస్తూ, విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ప్రయోజనార్థం కనీసం సగం బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.






