ఫాల్కన్ కంపెనీ విమానాన్ని వేలానికి పెట్టిన ఈడి

by Muthe.Rajitha |

ఫోంజీ స్కామ్ ద్వారా అక్రమాలకు పాల్పడిన ఫాల్కన్ కంపెనీకి చెందిన హాకర్ 800ఏ జెట్‌ విమానాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ( ఈడి)హైదరాబాద్ అధికారులు వేలానికి పెట్టారు. రూ.850 కోట్ల రూపాయల ఫాల్కన్ కుంభకోణంలో మార్చినెలలో శంషాబాద్ విమనాశ్రంయలో విమానాన్ని ఈడి స్వాధీనం చేసుకుంది.

ఫాల్కన్ కంపెనీ విమానాన్ని వేలానికి పెట్టిన ఈడి
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఫోంజీ స్కామ్ ద్వారా అక్రమాలకు పాల్పడిన ఫాల్కన్ కంపెనీకి చెందిన హాకర్ 800ఏ జెట్‌ విమానాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ( ఈడి)హైదరాబాద్ అధికారులు వేలానికి పెట్టారు. రూ.850 కోట్ల రూపాయల ఫాల్కన్ కుంభకోణంలో మార్చినెలలో శంషాబాద్ విమనాశ్రంయలో విమానాన్ని ఈడి స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో అన్లైన్ విధానం ద్వారా విమానాన్ని వేలం వేసేందుకు ఈడి చర్యలు చెపట్టింది. బేగం పేట ఎయిర్ పోర్టులో ఉన్న విమానాన్ని ఈ నెల 7వ తేది నుంచి ప్రదర్శనకు పెట్టనుంది. 9వ తేదిన అన్లైన్ విధానం ద్వారా వేలంలో విక్రయించనున్నట్లు పేర్కోంది. ఫాల్కన్ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన అమర్‌దీప్ కుమార్‌ హాకర్ 800ఏ జెట్‌ను కొనుగోలు చేసినట్లు ఈడి అధికారులు గుర్తించారు.

Next Story