- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతకు ఈడీ నోటీసులు
by GSrikanth |
తెలంగాణ కాంగ్రెస్ కీలకనేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో నోటీసులు పంపారు. రేపు ఉదయం(మే 31) 11 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ కీలకనేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో నోటీసులు పంపారు. రేపు ఉదయం(మే 31) 11 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 2022 నవంబర్ 23న అంజన్ కుమార్ యాదవ్ ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఈ కేసులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు ఈడీ విచారణకు హాజరయ్యారు. తాజాగా మరోసారి ఈడీ విచారణకు హాజరు కావాలని అంజన్ కుమార్ యాదవ్కు ఈడీ నోటీసులు పంపడం చర్చనీయాంశమైంది. గత ఏడాది ఈ కేసులో ఈడీ విచారణకు మాజీ మంత్రి గీతారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు హాజరయ్యారు. రూ.2 వేల కోట్ల విలువైన అసెట్స్, ఈక్విటీ లావాదేవీల విషయంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఆరోపించిన విషయం తెలిసిందే.
Next Story






