బ్రేకింగ్: మాజీ ఎంపీ వివేక్‌పై కేసు నమోదు చేసిన ఈడీ

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: మాజీ ఎంపీ వివేక్‌పై కేసు నమోదు చేసిన ఈడీ
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: మాజీ ఎంపీ, చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి​గడ్డం వివేకానందకు ఎన్నికల సమయంలో షాక్​తగిలింది. వివేకానందకు చెందిన విశాఖ ఇండస్ర్టీస్​లిమిటెడ్​నుంచి విజిలెన్స్​సెక్యూరిటీ సర్వీసెస్​సంస్థకు వెళ్లిన 8 కోట్ల రూపాయలు వ్యాపారంలో భాగంగా జరిగిన లావాదేవీ కాదని ఈడీ అధికారులు తెలిపారు. ఇక, విజిలెన్స్​సెక్యూరిటీ సంస్థ ఫెమా చట్టాన్ని ఉల్లంఘించిందని తెలిపారు. వివేకానంద కూడా ఈ చట్టాన్ని ఉల్లంఘించినట్టుగా పేర్కొన్న ఈడీ అధికారులు ఆయనపై ఫెమా చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఇటీవల విశాఖ ఇండస్ర్టీస్‌కు చెంది బేగంపేటలో ఉన్న ఓ బ్యాంకు నుంచి విజిలెన్స్​సెక్యూరిటీ సర్వీసెస్‌కు చెందిన ఆదర్శ్​నగర్‌లో ఉన్న బ్యాంక్​అకౌంట్‌లోకి 8 కోట్ల రూపాయలు రియల్​టైం గ్రాస్​సెటిల్​మెంట్​పద్దతిన ట్రాన్స్​ఫర్​అయిన విషయం తెలిసిందే.

ఈ మేరకు సమాచారం అందుకున్న సైఫాబాద్​పోలీసులు విజిలెన్స్​సెక్యూరిటీ సర్వీసెస్‌కు చెందిన ఖాతా వివరాలను తెలుసుకుని ఆ 8 కోట్ల రూపాయలను ఫ్రీజ్​చేశారు. ఈ సమాచారాన్ని ఈడీ, ఆదాయపు పన్ను శాఖతో పాటు జిల్లా ఎన్నికల రిటర్నింగ్​అధికారికి తెలిపారు. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు మంగళ, బుధవారాల్లో వివేకానందకు చెందిన ఇంటితో పాటు విశాఖ ఇండస్ర్టీస్, విజిలెన్స్​సెక్యూరిటీ కార్యాలయాల్లో సోదాలు జరిపారు. వాస్తవానికి విజిలెన్స్​సెక్యూరిటీ సర్వీసెస్​వివేకానంద పరోక్ష నియంత్రణలో నడుస్తున్నట్టు ఈడీ అధికారులు పేర్కొన్నారు.

ఇటువంటి పరిస్థితుల్లో వివేకానంద, ఆయన భార్య, ఆయనకు చెందిన కంపెనీలు విజిలెన్స్​సెక్యూరిటీ సర్వీసెస్‌తో 100 కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరిపినట్టుగా తమ విచారణలో నిర్ధారణ అయ్యిందన్నారు. ఈ లావాదేవీల్లో 20లక్షల రూపాయల లాభం కూడా వచ్చినట్టు బ్యాలెన్స్​షీట్‌లో పేర్కొన్నారన్నారు. విజిలెన్స్​సెక్యూరిటీ సర్వీసెస్‌కు ధీర్ఘకాలిక రుణాలు, అడ్వాన్సులు రూపంలో 64 కోట్ల రూపాయల మేర ఆస్తులు ఉన్నట్టుగా తెలిపారన్నారు. ఇక, విచారణలో బ్యాంకు ఖాతాను విశ్లేషించినపుడు 200 కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరిగినట్టుగా వెల్లడైందన్నారు. ఇక, విజిలెన్స్​సెక్యూరిటీ సర్వీసెస్​ఫెమా నిబంధనలను ఉల్లఘించినట్టుగా దర్యాప్తులో నిర్ధారణ అయ్యిందన్నారు. నిజానికి దీని మాతృసంస్థ యశ్వంత్​రియల్టర్స్​అని తేలిందన్నారు.

యశ్వంత్​రియల్టర్స్‌కు చెందిన అత్యధిక షేర్లు ఓ విదేశీయుని పేరు మీద ఉన్నట్టు తెలిపారు. తనిఖీల్లో డిజిటల్​డివైస్‌లు, డాక్యుమెంట్లు, కోట్లాది రూపాయల లెక్క లేని లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు దొరికాయన్నారు. దాంతోపాటు ప్రాపర్టీ డీల్స్‌లో పెట్టిన లెక్కల్లో చూపించని వందల కోట్ల రూపాయల వివరాలు లభ్యమైనట్టు తెలిపారు. గ్రూపులోని కంపెనీల్లో జరిగిన ఇంటర్నల్​లావాదేవీలకు చెందిన సమాచారం కూడా దొరికినట్టు చెప్పారు. వాస్తవానికి విజిలెన్స్​సెక్యూరిటీ సర్వీసెస్​బోగస్​సంస్థ, అది పేర్కొన్న చిరునామాలో ఎలాంటి ఆఫీస్​లేదని వివరించారు.

Next Story

Most Viewed