ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ మూడో ఛార్జిషీట్ దాఖలు

by GSrikanth |

దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ మూడో ఛార్జిషీట్ దాఖలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో గురువారం ఈడీ మూడో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాగుంట రాఘవ, గౌతమ్ మల్హోత్ర, రాజేశ్ జోషిలపై ఈడీ ఛార్జిషీట్ వేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్ట్ చేసిన నిందితుల విచారణకు సంబంధించిన అంశాలను ఈ చార్జీషీట్‌లో ఈడీ ప్రస్తావించింది. ఫిబ్రవరి 7వ తేదీన గౌతమ్ మల్హోత్ర, 8న రాజేశ్ జోషి, 10న మాగుంట రాఘవను అరెస్ట్ చేసినట్టు ఈ ఛార్జిషీట్‌లో ఈడీ తెలిపింది. ఈ అనుబంధ ఛార్జిషీట్‌పై ఈ నెల 14న సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ జరపనుంది. కేసు దర్యాప్తుకు సంబంధించి ఈ అనుబంధ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవాలో, లేదో అనే విషయాన్ని సీబీఐ ప్రత్యేక కోర్టు తేల్చనుంది.

Next Story