- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ రోజు ఉద్యోగులకు లీవ్ ఇవ్వాల్సిందే.. IT కంపెనీలకు ఈసీ సీరియస్ వార్నింగ్..!
by Satheesh |
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30 వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. ఆ రోజు అన్ని సంస్థలు, ఐటీ కంపెనీలు సెలవు ప్రకటించాలని లేని పక్షంలో కఠిన చర్యలు

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30 వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. ఆ రోజు అన్ని సంస్థలు, ఐటీ కంపెనీలు సెలవు ప్రకటించాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఇవాళ ఓ ప్రకటన జారీ చేశారు. ఉద్యోగులు ఆ రోజు ఓటు హక్కును వినియోగించుకునేలా సంస్థలు సెలవు ఇవ్వాలని ఆదేశించారు. గత 2018 అసెంబ్లీ, 2019 లోక్ సభ ఎన్నికల్లో కొన్ని సంస్థలు సెలవు ఇవ్వనట్లు ఫిర్యాదులు వచ్చాయని గుర్తుచేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని సంస్థలు సెలవు ఇచ్చాయో లేదో పరిశీలించాలని కార్మిక శాఖకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. సెలవు ఇవ్వని సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది.
Next Story






