రైతుబంధుకు ఈసీ బ్రేక్.. సీఎం కేసీఆర్ రియాక్షన్ ఇదే..!

by Sathputhe Rajesh |   (  Updated:2023-12-13 15:39:54  IST  )

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు షాక్ ఇస్తూ రైతుబంధు పథకానికి ఈసీ సోమవారం బ్రేక్ వేసిన విషయం తెలిసిందే.

రైతుబంధుకు ఈసీ బ్రేక్.. సీఎం కేసీఆర్ రియాక్షన్ ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు షాక్ ఇస్తూ రైతుబంధు పథకానికి ఈసీ సోమవారం బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. ఇక, ఈ అంశంపై షాద్ నగర్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ స్పందించారు. రైతుబంధును కాంగ్రెస్ వాళ్లే ఆపేశారన్నారు. రైతుబంధు తీసుకుంటున్న వాళ్లలో కాంగ్రెస్ వాళ్లు కూడా ఉన్నారన్నారు. రైతుబంధు డబ్బు వేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చానన్నారు. కాంగ్రెస్ కంప్లైంట్ తో ఈసీ మళ్లీ నిలిపివేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు సిగ్గు మానం ఉందా? మీరు రైతులేనా? అన్నదాతల నోటి కాడ కూడు ఎత్తగొడ్తరా? ధరణి తీసేస్తామనే కాంగ్రెస్ లో మీరు ఎలా తిరుగుతారు. కాంగ్రెస్ కార్యకర్తలు గుండె మీద చేయి వేసుకుని ఆలోచించుకోవాలన్నారు.

Next Story