ప్రజా శాంతి పార్టీ గుర్తు ఇదే..

by Disha Web Desk 14 |
ప్రజా శాంతి పార్టీ గుర్తు ఇదే..
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమ పార్టీకి ఎన్నికల సంఘం కుండ గుర్తు కేటాయించినట్టు ప్రజా శాంతి పార్టీ చీఫ్ డాక్టర్ కే ఏ పాల్ పేర్కొన్నారు. ఆయన రైల్వే న్యూ కాలనీ లో గల పార్టీ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ కి కుండ గుర్తు కేటాయించిన ఎన్నికల సంఘం అధికారులు, హైకోర్టు న్యాయమూర్తులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కుండలు తయారు చేసే కుమ్మరి మాదిరిగానే తాను కూడా ప్రజలు జీవితాలు తీర్చి దిద్దుతామన్నారు. కోర్టులో కేసు వేసి కుండ గుర్తు సాధించాను అని చెప్పారు.

ఫ్యాన్లకు ఉరి వేసుకుని ప్రజలు చనిపోయారు.. గ్లాసులు పగిలి పోయాయి.. సైకిళ్లకు ప్రమాదాలు జరుగుతున్నాయి.. అని విమర్శించారు. తాను గెలిపిస్తే ఉచిత విద్య, వైద్యం, నిరుద్యోగులకు ఉపాధి స్టీల్ ప్లాంట్ అనుబంధంగా వెయ్యి కంపెనీలు ద్వారా ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు మోడీ, కేసీఆర్, జగన్ కు అవకాశం ఇచ్చారని, ప్రజా శాంతి పార్టీ కి ఒక్క అవకాశం ఇవ్వాలి అని కోరారు. ప్రధాన పార్టీల్లో టిక్కెట్లు రానీ వారు తమ పార్టీలో చేరడానికి వస్తున్నారని తెలిపారు. కుటుంబ, కుల పాలనకు చరమ గీతం పాడాలి అన్నారు. స్టీల్ ప్లాంట్ భూములను అమ్మేస్తున్నారు. కంపెనీలు అహ్మదాబాద్ తరలి పోతున్నాయి. బొత్స సత్యనారాయణ కుటుంబం అక్కడ దోచుకుని ఇప్పుడు విశాఖ వచ్చారు అని ఆరోపించారు.



Next Story

Most Viewed