సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ వద్ద డ్రోన్ కలకలం

by Disha Web Desk 13 |
సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ వద్ద డ్రోన్ కలకలం
X

దిశ, డైనమిక్ బ్యూరో:సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ వద్ద డ్రోన్ కలకలం రేపింది. సోమవారం మేడ్చల్ జిల్లాలో నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభకు సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వద్ద అనుమతి లేకుండా ఓ వ్యక్తి డ్రోన్ ఎగరవేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు డోన్ ఎగురవేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో డ్రోన్ ఎగురవేసిన వ్యక్తి రామంతపూర్ కు చెందిన గణేశ్ రెడ్డిగా గుర్తించారు. కాగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్, నిజామాబాద్ తో పాటు మేడ్చల్ జిల్లాలో పర్యటించారు. బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కు అయ్యారని, రాష్ట్రంలో 5 ఎంపీ స్థానాల్లో బీజేపీని గెలిపించేలా ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. గడిచిన పదేళ్లుగా బీఆర్ఎస్, బీజేపీ ఎంపీలు తెలంగాణకు సాధించిందేమిటని ప్రశ్నించారు.

Next Story