- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మారుతీనగర్లో డ్రైనేజీ సమస్యకు మోక్షం.. ఎమ్మెల్యే నిధులతో పనులు షురూ
అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్సొంత నిధులతో డ్రైనేజీ పైపులైన్పనులను ప్రారంభిస్తున్నట్లు మారుతీనగర్అధ్యక్షులు సురేశ్గౌడ్ తెలిపారు.

X
దిశ, హైదరాబాద్ బ్యూరో: అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్సొంత నిధులతో డ్రైనేజీ పైపులైన్పనులను ప్రారంభిస్తున్నట్లు మారుతీనగర్అధ్యక్షులు సురేశ్గౌడ్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ 3వ వీధిలో డ్రైనేజీ పైపులైన్ శిథిలావస్థకు చేరడంతో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎమ్మెల్యే సొంత నిధులతో కొత్త డ్రైనేజ్ పైపులు కొనుగోలు చేసి, పాత లైన్ స్థానంలో కొత్త డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయిస్తున్నామన్నారు. కాలనీవాసులు ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ జనరల్ సెక్రటరీ నవకాంత్, కాలనీవాసులు పాల్గొన్నారు.
Next Story






