- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
డాక్టర్ శ్యాం సుందర్ దుర్గంకు బంగారు పతకం
దిశ, తెలంగాణ బ్యూరో: ఆయుష్మాన్ భారత్, నేషనల్హెల్త్ మిషన్ కార్యక్రమాల్లో విశేష సేవలు అందించినందుకు రాష్ట్రానికి చెందిన డాక్టర్ శ్యాం సుందర్దుర్గంకు బంగారు పతకం వరించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జన్మించి అదే జిల్లాలో ప్రజారోగ్య వైద్యునిగా వైద్య సేవలు అందించడంతో పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ ఢిల్లీ లో ప్రతిభ చూపినందుకు ఈ అవార్డును అందించినట్లు కేంద్రం పేర్కొన్నది. ఈ మేరకు నేషనల్ హెల్త్ సెక్రటరీ రాజేష్ భూషణ్ గురువారం అవార్డును అందజేసి, సన్మానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్యాంసుందర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్రావు సారథ్యంలో ఆరోగ్య తెలంగాణగా తయారవుతున్నదన్నారు.
ఇక తనకు అవార్డు వచ్చేలా అన్ని రకాలుగా ప్రోత్సహించిన టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ డాక్టర్ఎర్రోళ్ల శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ కత్తి జనార్దన్ మాట్లాడుతూ.. పబ్లిక్హెల్త్డాక్టర్ శ్యామ్ కు జాతీయస్థాయిలో బంగారు పతకం రావడం సంతోషంగా ఉన్నదన్నారు. ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అందరూ అంకితభావంతో పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని జాతీయస్థాయిలో అగ్ర భాగాన నిలిపేలా కృషి చేయాలన్నారు.