డీఎంఅండ్‌హెచ్‌ఓల రాష్ట్ర అధ్యక్షుడిగా డా.పుట్ల శ్రీనివాస్

by Disha Web Desk 13 |
డీఎంఅండ్‌హెచ్‌ఓల రాష్ట్ర అధ్యక్షుడిగా డా.పుట్ల శ్రీనివాస్
X

దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణ డీఎంఅండ్ హెచ్ ఓ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ పుట్ల శ్రీనివాస్ ఎన్నికయ్యారు. రాష్ట్ర డీఎంఅండ్ హెచ్ వో ల సంఘం ఆవిర్భావ సమావేశం బుధవారం హైదరాబాద్ వెంగల్ రావు నగర్ లోని ఐఐహెచ్‌ఎఫ్‌డబ్ల్యూలో జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడితో పాటు సభ్యులను ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా డా.కె.మల్లికార్జున్ రావు, కోశాధికారిగా డా. ఎ.పరిపూర్ణ చారి, ముఖ్యసలహాదారుగా డా.ఎ.కొండల్ రావు, ఉపాధ్యక్షులు గా డా.కోటాచలం, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా డా.బి. బల్వన్, డా.ఆర్.శ్రీదేవి, డా.టి.రఘునాథ్ స్వామి, డా.సాంబశివరావు, డా. కృష్ణ, డా. అంబరీష్, డా. సుధాకర్ లాల్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వీరంతా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహాను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజా ఆరోగ్యం కోసం ప్రభుత్వం తీసుకునే కార్యక్రమాలను విజయవంతంగా అమలు అయ్యేలా పని చేస్తామన్నారు.

Next Story

Most Viewed