- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు.. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం
డీఎమ్హెచ్వోల పోస్టులు ఏర్పాటు చేయడం హర్షనీయమని ప్రభుత్వ వైద్యుల సంఘం డీహెచ్ విభాగం అధ్యక్షుడు డాక్టర్ లాలు ప్రసాద్ రాథోడ్ పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: వైద్య ఆరోగ్యశాఖలో ఎన్నో ఏళ్ల నుంచి రీఆర్గనైజేషన్ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న సందర్భంగా కొత్త డీఎమ్హెచ్వోల పోస్టులు ఏర్పాటు చేయడం హర్షనీయమని ప్రభుత్వ వైద్యులసంఘం డీహెచ్ విభాగం అధ్యక్షులు డాక్టర్ లాలు ప్రసాద్ రాథోడ్ పేర్కొన్నారు. ముఖ్యంగా హైదరాబాదుకు నూతనంగా 6 డీఎమ్హెచ్వోల ఏర్పాటు , అర్బన్ పీహెచ్సీ లలో రెగ్యులర్ వైద్యులను తీసుకోవడం వంటివి ఆరోగ్య రంగానికి విప్లవాత్మక మార్పులని కొనియాడారు.
గురువారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. కొత్త ప్రజారోగ్య పథకాలు , మంచి కార్యక్రమాలు చేపట్టడం మంత్రి హరీష్రావుతోనే సాధ్యమని స్పష్టం చేశారు. దీంతో పాటు టైం బౌండ్ ప్రమోషన్ల విషయంలో కూడా నిర్ణయం తీసుకొని ప్రజారోగ్య విభాగంలోని వైద్యులకు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బహుమానం అందించాలని కోరారు. సీఎం కేసీఆర్,మంత్రి హరీష్ రావు, డీహెచ్శ్రీనివాసరావులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు దీన్దయాల్, రంజిత్ రెడ్డి, లక్ష్మీ ప్రసన్న, నవ్య, మౌనిక, తదితరులు ఉన్నారు.






