రోడ్డు ప్రమాదాలు ఏ సమయంలో ఎక్కువగా జరుగుతాయో తెలుసా?

by Disha Web Desk 9 |
రోడ్డు ప్రమాదాలు ఏ సమయంలో ఎక్కువగా జరుగుతాయో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: మన దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ యాక్సిడెంట్ల వల్ల రోజుకు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాలపై అధికారులు ప్రజలకు.. భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు, సూచనలు చేస్తూ.. వాహనాదారుల్లో అవగాహన కల్పిస్తున్నారు. అయినా కూడా ఈ రోడ్డు యాక్సిడెంట్స్ ఏ మాత్రం తగ్గడం లేదు. పైగా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి.

అయితే తెలంగాణలో ఏ సమయాల్లో ఎక్కువగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయనే దానిపై ఆరా తీసిన అధికారులు 2022లో నమోదైన రోడ్డు ప్రమాదాలు ప్రకారం.. మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 9 గంటల సమయంలో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని నిర్ధారించారు. విద్యార్థులు పాఠశాల నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు, పనులు ముగించుకున్న ఉద్యోగులు, ఇతర పనులపై ప్రజలు రహదార్లపైకి ఎక్కువగా రావడం వల్ల ఆక్సిడెంట్ల సంఖ్య రోజురోజుకు అధికంగా పెరుగుతున్నట్లు తెలిపారు.



Next Story

Most Viewed