వాళ్లకు శుభాకాంక్షలు తెలిపిన టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి

by Dishafeatures2 |
వాళ్లకు శుభాకాంక్షలు తెలిపిన టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: కొన్ని నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాష్ట్రంపై బీజేపీ జాతీయ నాయకత్తం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే జాతీయ పార్టీలో రాష్ట్రానికి చెందిన పలువురికి స్థానం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా జాతీయ కమిటీలో స్థానం సంపాదించుకున్న నేతలకు కేంద్ర మంత్రి, టీబీజేపీ చీఫ్ జి.కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. డీకే అరుణ, బండి సంజయ్, సత్యకుమార్ తమ పదవులు అన్ని విధాలుగా న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.

కాగా రాష్ట్రానికి చెందిన డీకే అరుణను బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా, బండి సంజయ్ ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా, సత్యకుమార్ ను జాతీయ కార్యదర్శిగా నియమిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్ణయం తీసుకున్నారు. కాగా టీబీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని అంతా అనుకుంటున్న నేపథ్యంలో బండి సంజయ్ కి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడం పొలిటికల్ సర్కిల్ లో చర్చనీయాంశంగా మారింది.

Next Story

Most Viewed