- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెండింగ్ బిల్లులు చెల్లించాలని జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు కాంట్రాక్టర్ల ధర్నా
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తమ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టర్లు మంగళవారం జిహెచ్ఎంసి ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు.

X
దిశ, సిటీ బ్యూరో: దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తమ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టర్లు మంగళవారం జిహెచ్ఎంసి ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన కాంట్రాక్టర్లు జిహెచ్ఎంసి ఆఫీస్ ను ముట్టడించే యత్నం చేయగా పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అడ్డుకున్నారు. కాంట్రాక్టర్లను వారి కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలించారు. కారణంగా జిహెచ్ఎంసి ఆవరణలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నో వర్క్ నో పేమెంట్ నినాదాలు చేసినా కాంట్రాక్టర్ తమ బిల్లులు చెల్లించే వరకు ఎలాంటి పనులు చేసేది లేదని స్పష్టం చేశారు.
Next Story






